టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం

1 min read

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దళిత బంధుపైన ద్రుష్టి సారించారు. పథకం అమలులో టీఆర్ఎస్ పార్టీని భాగస్వామ్యం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందు కోసం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న మధ్యాహ్నాం తెలంగాణ భవన్ లో ఈ సమావేశం జరగనున్నది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు శాఖల పునర్నిర్మాణంపైన ఇందులో చర్చించనున్నారు. కమిటీల ఏర్పాటు  ఎలా ఉండాలి, ఎప్పుడు చేయాలన్న దానిపైన కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఇదే సమయంలో దళిత బంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు ఎలా వ్యవహారించాలన్న అంశంపైన కూడా చంద్రశేఖర్ రావు మాట్లాడనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn