రేవంత్ రెడ్డి దీక్షకు రంగం సిద్ధం
1 min readపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దళిత,గిరిజన దీక్షను చేపట్టనున్నది. 48 గంటల పాటు జరిగే ఈ దీక్షలో కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొంటారు. మేడ్చల్ సమీపంలో మూడు చింతలపల్లి గ్రామంలో దీక్షకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి దీక్ష ఇది. మూడు చింతల పల్లి గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దత్తత తీసుకున్నారు. అయినప్పటికి అక్కడ ఎలాంటి అభివ్రుద్ధి జరగలేదని కాంగ్రెస్ అంటోంది. రెండు రోజుల పాటు సాగే ఈ దీక్షలో సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొంటున్నారు.