వైసీపీలోకి టీడీపీ ఎంపీ కేశినేని నాని

1 min read

విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనున్నారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ఆయన తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. త్వరలోనే వైసీపీలో చేరుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి గా ఉన్న కేశినేని చివరకు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కేశినేని తో పాటు ఆయన కుమార్తె శ్వేత కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆమె విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ గా పనిచేస్తున్నారు.

 

https://youtube.com/live/qNluzeyyhdE?feature=share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn