42 కోట్లను పట్టుకున్న ఐటీ అధికారులు
1 min read
5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బెంగళూరులో భారీగా డబ్బు బయటపడింది. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఏకంగా 42 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. బెంగూళురులో ఆత్మానంద కాలనీలోని ఓ ఇంట్లో పరుపు కింద దాచి ఉంచిన 23 పెట్టెల్లో 500 నోట్ల కట్టలను కనుగోన్నారు. ఈ మొత్తం 42 కోట్లగా అధికారులు లెక్క తేల్చారు. కర్ణాటక డిప్యూటీ సిఎం డీకె శివకుమార్ సన్నిహితులకు చెందిన డబ్బుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు తరలించేందుకే ఈ డబ్బును సేకరించారంటు మంత్రి హరీష్ రావు ఆరోపించారు.