లారీలో రాహుల్ గాంధీ ప్రయాణం

1 min read

కాంగ్రెస్ మాజీ ఎంపి రాహుల్ గాంధీ నిత్యం ఏదో ఒక రూపంలో ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. భారత్ జోడో యాత్రతో భారీ పాదయాత్ర నిర్వహించిన ఆయన తాజాగా జనం సమస్యలు తెలుసుకోవడానికి వినూత్నంగా వ్యవహారిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ తాజాగా లారీలో జర్నీ చేశారు.  డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడం కోసం ఆయన సెక్యూరిటీ, మీడియా హడావుడి లేకుండా లారీలో ప్రయాణం చేశారు. దాబాలో డ్రైవర్లతో మాటామంతీ చేశారు. హైవేలో రాహుల్ గాంధీని గుర్తుపట్టిన కొందరు ఆయనకు అభివాదం చేశారు. ప్రధాని మోదీ రేడియోలో మన్ కీబాత్ చేస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం ప్రజల్లో తిరుగుతు మన్ కీ బాత్ వింటున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn