ఎపీ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

1 min read

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.పంచాయతీ ఎన్నికలను ఆపడం కోసం సి.ఎం జగన్ చేసిన ప్రయత్నాలకు రాష్ట్ర హైకోర్టు అడ్డు తగిలింది. పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తు ఎపి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికలు, ప్రజల ఆరోగ్యం రెండూ ముఖ్యమేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. రెండింటిని సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఎపిలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తు ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. ఈ తీర్పుపైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు. దీనిపైన ఈ రోజు హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలినట్లైంది. మరో వైపు హైకోర్టు తీర్పుపైన ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn