ఖమ్మంలో అమిత్ షా బహిరంగసభ

1 min read

తెలంగాణపైన బీజేపీ అగ్రనాయకత్వం ద్రుష్టి సారించింది. ఎన్నికల సమీపంలోనే ఉండటంతో పార్టీలో ఉత్తేజం నింపడానికి కీలక నేతలు రాష్ట్ర పర్యటనలకు సిద్దమౌతున్నారు. ఈ నెలలో బీజేపీ ఇద్దరు అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు. మహా జనసంపర్క్ అభియాన్ లో భాగంగా ఈ నెల 15న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారు. 25న నాగర్ కర్నూల్ సభలో జెపి నడ్డా పాల్గొంటారు. పార్లమెంట స్థానాల వారీగా దేశవ్యాప్తంగా బీజేపీ బహిరంగసభలు నిర్వహిస్తోంది. అమిత్ షా ఖమ్మం రాకతో మరో సారి మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక అంశం తెరపైకి వచ్చా అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn