ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల
1 min read
ఎస్సీ వర్గీకరణ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీవో తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రివర్గ ఉపసంఘం అందజేసింది. సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ మంత్రి వర్గ ఉప సంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , సంఘం సభ్యులు మంత్రులు దామోదర్ రాజా నర్సింహ, పొన్నం ప్రభాకర్, ఏక సభ్య కమిషన్ చైర్మన్ శ్రీ శమీమ్ అక్తర్, ఎంపీ బలరాం నాయక్, సోషల్ వెల్ఫేర్ కార్యదర్శి శ్రీధర్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఎస్సీ వర్గీకరణ కు తెలంగాణ అసెంబ్లీ ఇటీవల ఆమోదించింది.