కర్ణాటక కాంగ్రెస్ పార్టీదే

1 min read

కర్ణాటక కాంగ్రెస్ కైవసం అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి కన్నడ రాష్ట్రాన్ని హస్తం పార్టీ ఖాతాలో పడటం ఖాయమని సర్వేలు తేల్చి చెపుతున్నాయి. స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానున్నదని తేలిపోయింది. ప్రధాని మోదీ ర్యాలీలు, సభలతో కర్ణాటకను హోరెత్తించినప్పటికి ప్రయోజనం ఉండదని సర్వేల స్పష్టం చేస్తున్నాయి. తాజా సౌత్ ఫస్ట్.. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చింది. ఆ పార్టీ 105 నుంచి 117 సీట్ల వరకు వచ్చే అవకాశముందని సర్వే చెపుతోంది. బీజేపీ 81 నుంచి 93 సీట్లు , జనతాదళ్ కి 24 నుంచి 29 వరకు సీట్లు వస్తాయని స్పష్టం చేశారు. ఇతరులు 1 నుంచి 3 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వేలో పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలని 42 శాతం మందిని కోరుకోవడం ఇక్కడ విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn