ఎపిలో కేసీఆర్ న్యూస్ పేపర్ ఎంట్రీ
1 min readఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన ఆయన మరింత మంది నేతల చేరికపైన ద్రుష్టి సారించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ భావజాల వ్యాప్తి కోసం ఆంధ్రప్రదేశ్ లో న్యూస్ పేపర్ పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో త్వరలోనే దినపత్రికను తీసుకురానున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నమస్తే తెలంగాణ దినపత్రికను కేసీఆర్ కుటుంబం నడిపిస్తోంది. అలాగే టీ న్యూస్ పేరుతో న్యూస్ ఛానల్ ను కూడా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కోసం జాతీయ స్థాయిలో టీవీ ఛానల్, హిందీ పత్రికను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కోసం పత్రిక రానున్నది.