కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
PMAY (G) 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు కేటాయించాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో గ్రామీణ ఇళ్ల నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఎల్నినో నేపథ్యంలో వీబీ-జీ రామ్-జీలో అదనపు పనులు చేర్చాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. రైతుల జీవనోపాధి మెరుగుకు 10 కొత్త పనులను వీబీ-జీ రామ్-జీలో చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.రైతుల భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ, ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ పనులకు అవకాశం కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పనులను వీబీ-జీ రామ్-జీ జాబితాలో చేర్చి లబ్ధిదారులకు 90 రోజులు పని కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
