పోలీస్ అమరవీరుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి బాసట
1 min read
ములుగు జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చి కాల్పులు జరిపిన ఘటనలో మృతి చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. అమరులైన కానిస్టేబుళ్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రభుత్వపరంగా వారికి అన్ని రకాల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కొ కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి స్పెషల్ ఎక్స్ గ్రేషియా అందిస్తుందని ప్రకటించారు. భద్రత స్కీమ్ లో రూ.80 లక్షలు, మూడు వందల గజాల ఇంటి స్థలం కేటాయించటంతో పాటు కుటుంబీకుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. చనిపోయిన వారిలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్కు చెందిన సందీప్(27), కామారెడ్డి జిల్లా పల్వంచకు చెందిన వడ్ల శ్రీధర్(29), ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కానిస్టేబుల్ పవన్కల్యాణ్ (23) ఉన్నారు.