కేసీఆర్ కు భారీ షాక్
1 min readకవిత అరెస్ట్ తో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కి ఒక ఎమ్మెల్యే, మరో ఎంపీ గుడ్ బై చెప్పారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. చేవెళ్ల బీఆర్ఎస్ లోక్ సభ సభ్యులు రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనను చేవెళ్ల నుంచి పోటీ చేయాల్సిందిగా కేసీఆర్ కోరినప్పటికి తిరస్కరించారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గా రంజిత్ రెడ్డి బరిలో ఉండే ఛాన్స్ ఉంది. మరో వైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ ను సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి వరుసగా చేరికలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ, బీఆర్ఎస్ సవాలు చేస్తుంటే చూస్తూ ఎలా కూర్చుంటామని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే మరో పదిహేను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకునే ఛాన్స్ ఉంది.