టీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి బిగ్ షాక్

1 min read

టీఆర్ఎస్ పార్టీకి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పెద్ద షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఓదేలు సతీమణి , మంచిర్యాల జడ్పీ ఛైర్మన్ భాగ్యలక్ష్మి కూడా కాంగ్రెస్  కండువా కప్పుకున్నారు. వీరితో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా వీరిని రాహుల్ గాంధీ దగ్గరకు తీసుకెళ్లారు. నల్లాల ఓదేలు టీఆర్ఎస్ తరుపున మూడు సార్లు చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికల్లో కేసీఆర్ కు ఆయనకు టిక్కెట్ నిరాకరించారు. కేటీఆర్ సన్నిహితుడు బాల్క సుమన్ కు చెన్నూరు టిక్కెట్ ఇచ్చారు. దీంతో ఓదేలు తీవ్ర అసంత్రుప్తికి గురయ్యారు. కేసీఆర్ హామీతో టీఆర్ఎస్ లోనే కొనసాగిన ఆయన గత కొంతకాలంగా బాల్క సుమన్ వైఖరీపైన ఆగ్రహంగా ఉన్నారు. నియోజకవర్గంలో తనను తొక్కేయాలన్న ప్రయత్నాలు జరుగుతుండటంతో ఓదేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన సతీమణి భాగ్యలక్ష్మి మంచిర్యాల జిడ్పీ ఛైర్మన్ గా వ్యవహారిస్తున్నారు. ఆమె కూడా కాంగ్రెస్ లో చేరడంతో జడ్పీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn