​డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి పెళ్లిలో సామాన్యులు

అధికార హోదా ఉన్నా.. ఆత్మీయతకే పెద్దపీట!
​డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి వివాహంలో ‘పాదయాత్ర’ బంధువుల సందడి
రాజకీయ హోదాలు, అధికార దర్పం కంటే మనుషుల మధ్య ఉండే అనుబంధాలే గొప్పవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరూపించారు. తన కుమారుడి వివాహ వేడుకను కేవలం ప్రముఖుల కలయికగా మార్చకుండా, కష్టకాలంలో తనకు తోడు నిలిచిన సామాన్యులను ఆహ్వానించి గౌరవించడం ద్వారా ఆయన తన సంస్కారాన్ని చాటుకున్నారు.
​ఆత్మీయ బంధువుల రాక
​తెలంగాణ వ్యాప్తంగా భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో ఆయనకు అండగా నిలిచిన మారుమూల గ్రామాల ప్రజలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం బూసిమెట్టకు చెందిన వాలే లక్ష్మి బాయ్, డాకూర్ రుక్మబాయ్.. అలాగే ఉట్నూరు మండలం దేవగూడకు చెందిన మరప గంగుబాయ్, సిడం లక్ష్మీబాయి, నాగజ్యోతి వంటి మహిళలు ఈ వివాహానికి హాజరై సందడి చేశారు.
​కొడుకు, కోడలికి ‘కన్నతల్లి’ పరిచయం
​పాదయాత్ర సమయంలో ఎండనక, వాననక అడుగులు వేస్తున్నప్పుడు తనను కన్నబిడ్డలా ఆదరించి, ఆకలి తీర్చిన తీరును భట్టి విక్రమార్క స్వయంగా తన కుమారుడు, కోడలికి వివరించారు. “వీరే నన్ను ఆనాడు కంటికి రెప్పలా చూసుకున్న నా ఆత్మీయులు” అని ఆయన పరిచయం చేస్తుంటే అక్కడ ఒక భావోద్వేగ వాతావరణం నెలకొంది.
​పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం
​ఈ వేడుకలో మరో ముఖ్య ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. కేవలం అతిథులుగా వారిని ఆహ్వానించడమే కాకుండా, ఆ పెద్దమ్మల పాదాలకు నూతన వధూవరులు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
అధికార హోదాలో ఉన్నా కూడా
సామాన్యుల పట్ల చూపిన ఈ వినమ్రతపై అతిథులు ప్రశంసలు కురిపించారు. వధూవరులు నూరేళ్ల పాటు చల్లగా ఉండాలని ఆ గ్రామీణ మహిళలు మనస్ఫూర్తిగా దీవించారు.
​”కష్టకాలంలో తోడున్న వారిని గుర్తుపెట్టుకోవడం, వారికి సముచిత గౌరవం ఇవ్వడం గొప్ప సంస్కారం” అని వేడుకకు హాజరైన వారు చర్చించుకోవడం కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn