జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థికి 40 లక్షలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారు బి ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున 40 లక్షల రూపాయలు చెక్కు ను అందించారు. దివంగత మాగంటి గోపీనాథ్ కూతుళ్లు కుమారుడు కూడా మాజీ సీం కేసీఆర్ ను కలిశారు.