*ఉమెన్ కమిషన్ ను క్షమాపణ కోరిన వేణుస్వామి..*

1 min read
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి మరో సారి వార్తల్లోకి ఎక్కారు. గతంలో హీరో నాగచైతన్య దంపతులపైన చేసిన వ్యాఖ్యలపైన తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.తెలంగాణ ఉమెన్ కమిషన్ కి  ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పారు.గతంలో నాగచైతన్య, శోభిత లు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని వేణుస్వామి జోష్యం చెప్పారు. ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
వేణు స్వామి వ్యాఖ్యలపై ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపైన
దీనిపై వేణు స్వామి కి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీచేసింది. ఉమెన్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ  ఆయన  హైకోర్టు ఆశ్రయించారు. అయితే కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో వేణుస్వామికి మరో సారి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో దిగివచ్చిన ఆయన మహిళా కమిషన్ ముందు హాజరై క్షమాపణ కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కానివ్వొద్దని వేణు స్వామిని ఉమన్ కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn