సిఎం కేసీఆర్ తో శంకర్ సింఘ్ వాఘేలా భేటీ
1 min read
జాతీయ రాజకీయాల్లో వెళ్లడానికి ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ సిఎం కేసీఆర్ ఆ వైపుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దసరా పండుగ రోజున జాతీయ పార్టీని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వరస భేటీలు కొనసాగుతున్నాయి. ఇటీవలె కర్ణాకట మాజీ సిఎం కుమార స్వామితో సమావేశం అయిన కేసీఆర్ తాజాగా గుజారాత్ మాజీ సిఎం శంకర్ సింఘ్ వాఘేలాతో భేటీ అయ్యారు. వాఘేలా స్వయంగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ తో చర్చలు జరిపారు. త్వరలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. శంకర్ సంఘ్ వాఘేలా గుజరాత్ లో కొత్త పార్టీ ఏర్పాటు చేయడానికి సిద్ధమౌతున్నారు. ప్రస్తుత సమావేశం నేపథ్యంలో వాఘేలా సిఎం కేసీఆర్ తో కలిసి ముందుకు వెళ్తారనే ప్రచారం ప్రారంభమైంది.