తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు నియామకమయ్యారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. 1992 బ్యాచ్ కు చెందిన సంజయ్ జాజు పదవీకాలం 2029 వరకు ఉంది. ప్రస్తుతం సీఎస్ రామక్రిష్ణారావు ఈ నెల 30 వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక హోదాల్లో పనిచేశారు. 2014 నుంచి కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్నారు.
