రాజిసంగ్ వర్సెస్ కమిషనర్ సజ్జనార్

1 min read

గోరక్షణ పైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ , సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆవులు భారీ ఎత్తున తెలంగాణలోకి అక్రమ రవాణా అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని రాజాసింగ్ తాజాగా ధ్వజమెత్తారు. కొంత మంది పోలీసులు బ్రోకర్లుగా తయారయ్యారని ఆయన తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. గోరక్షణ చేస్తున్న వారిని వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. దీనిపైన కమిషనర్ సజ్జనార్ స్పందించారు. పోలీస్ లపైన అనవసరంగా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని, కేసులు పెడతామని హెచ్చరించారు. సజ్జనార్ వ్యాఖ్యలపైన రాజాసింగ్ మరో సారి స్పందించారు. కేసులకు సిద్దంగా ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు. కమిషనర్ సరైన వివేదికలు తెప్పించుకోని వాస్తవాలను పరిశీలించాలని రాజాసింగ్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn