మాగుంట రాఘవరెడ్డికి ఊరట

1 min read

ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితుడు మాగుంట రాఘవరెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెండువారాల పాటు బెయిల్ ఇస్తు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ యేడాది ఫిబ్రవరి 10న రాఘవరెడ్డిని లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేశారు. వైపీసీ ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డి.

ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాకు మాత్రం కోర్టు గతంలో బెయిల్ నిరాకరించింది. తన భార్య తీవ్రఅనారోగ్యంతో ఉన్న కారణంగా ఆరువారాల పాటు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఆయన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. అయితే భార్యను పరామర్శించడానికి కొన్ని గంటల పాటు మనీష్ సిసోడియాకు కోర్టు అవకాశం ఇచ్చింది. కాని ఆయన ఇంటికి వెళ్లే లోపే తీవ్రఅనారోగ్యం కారణంగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీంతో భార్యను చూసే అవకాశం కూడా మనీష్ కు దక్కలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn