విజయవంతంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్
1 min read
తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన విజయవంతం గా ముగిసింది.
16న జపాన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం ఏడు రోజుల పర్యటన మంగళవారం హిరోషిమా సందర్శనతో పూర్తయింది.
జపాన్ నుంచి ముఖ్యమంత్రి హైదరాబాద్ కు బయల్దేరారు.
ముందుగా దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బయల్దేరుతారు.
రాత్రి 8.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు
■ జపాన్ పర్యటనలోనూ పెట్టుబడులతో పాటు తెలంగాణ ప్రభుత్వం సరి కొత్త లక్ష్యాలను చేరుకుంది.
■ తెలంగాణలో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
■ అంతర్జాతీయ సంబంధాలు, పరస్పర సహకార సంప్రదింపులు జరపడంలో కొత్త అధ్యాయానికి తెర లేపింది.
■ జపాన్లో పేరొందిన కంపెనీలతో రూ.12062 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో దాదాపు 30,500 కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.
■ జనవరిలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు..50 వేల ఉద్యోగాలు
■ జనవరిలో అమెరికా, సౌత్ కొరియా, సింగపూర్ లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యటించింది. రూ.14,900 కోట్ల పెట్టుబడులు సాధించింది.
■ గత ఏడాది 2024 దావోస్ పర్యటనలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి (2023 డిసెంబర్) నుంచి ఇప్పటివరకు సాధించిన
మొత్తం పెట్టుబడులు: రూ. 2,44,962 కోట్లు
ఉద్యోగ అవకాశాలు: 80,500