మోదీపైన టీఆర్ఎస్ ప్రివిలైజ్ మోషన్
1 min readభారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైన టీఆర్ఎస్ పార్టీ ప్రివిలైజ్ మోషన్ ఇచ్చింది. ఆ పార్టీ ఎంపిలు రాజ్యసభలో తమ లేఖను అందజేశారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, ఎంపిలు సంతోష్, లింగయ్య యాదవ్, సురేష్ రెడ్డి ప్రధాని మీద ప్రివిలైజ్ మోషన్ ఇచ్చారు. ఇటీవల రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపైన వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. షేమ్ పుల్ మ్యానర్ లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు తీసుకువచ్చారన్న మోదీ వ్యాఖ్యలను వారు తప్పు పట్టారు.