ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బుజ్జగింపులు

1 min read

పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన తీవ్ర అసంత్రుప్తితో ఉన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. తనపైన కోవర్ట్ గా ముద్ర వేస్తున్నారని ఆరోపిస్తున్న ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారు. దీంతో పార్టీ అధిష్టానం స్పందించింది. జగ్గారెడ్డిని బుజ్జగించడానికి పార్టీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఎఐసిసి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ ఆయనతో మాట్లాడారు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జగ్గారెడ్డికి ఫోన్ చేశారు. మరో సీనియర్ నేత వి.హనుమంతరావు ఆయన నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ కూడా జగ్గారెడ్డితో మాట్లాడే అవకాశముంది. మరో వైపు ఈ ఎపిసోడ్ ఇలా కొనసాగుతుండగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn