కాంగ్రెస్ కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గుడ్ బై

1 min read

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే,ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆయనకు కాషాయ కండువా కప్పారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైన మహేశ్వ ర్ రెడ్డి గత కొంత కాలంగా అసంత్రుప్తితో ఉన్నారు. ఇటీవల ఆయన చేపట్టిన పాదయాత్ర ను పార్టీ బలవంతంగా నిలిపివేసింది. పాదయాత్రను ఆపాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు థాక్రే ఆయనను ఆదేశించారు. దీనిపైన మహేశ్వర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. తన పాదయాత్రను ఎందుకు ఆపారో చెప్పాలంటు ఆయన థాక్రేకు లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. తాజాగా పీసీసీ క్రమశిక్షణా సంఘం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.గంటలో సమాధానం చెప్పాలని నోటీసుల్లో ఆదేశించారు.  అయితే తాను పార్టీ మారడం లేదని చెప్పిన ఇరవై నాలుగు గంటల్లో మహేశ్వర్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. మహేశ్వర్ రెడ్డి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే. ఆయన పార్టీని వీడటంతో నిర్మల్ లో కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేకుండా పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn