రామ్మోహన్ నాయుడు కొడుకు నామకరణంలో సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడి నామకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి అనేక మంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తన తండ్రి ఎర్రన్నాయుడు పేరు కలిసి వచ్చేలా తన కుమారుడికి శివాన్ ఎర్రన్నాయుడు అని రామ్మోహన్ నాయుడు పేరు పెట్టారు.
