సోనియా ,రాహుల్ తో టీ కాంగ్రెస్ బీసీ లీడర్లు
1 min read
తెలంగాణ కాంగ్రెస్ బీసీ నాయకులు ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ని కలిశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.
తెలంగాణ కులగణన చేపట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించడంతో పాటు ఢిల్లీ జంతర్, మంతర్ వద్ద బీసీ సంఘాల దీక్షను సోనియా, రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచే అంశాలపై 9 షెడ్యూల్ లో పెట్టించి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.