సౌదీ ఘటన పైన సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే పూర్తి వివరాలు తెలుసుకుని అవసరమైన ఏర్పాట్లు చేశాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా బస్సు ప్రమాదానికి లోనైంది. ఈ ఘనటలో పలువురు హైదరాబాద్ వాసులు ప్రాణాలు కోల్పోయారు.
వెంటనే స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీ ని అదేశించారు. తెలంగాణ కు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని అదేశించారు
సీఎం అదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీ లో ఉన్న కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదం లో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు.
సచివాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు .సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జెడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్, రియాద్లోని డిప్యూటీ అంబాసిడర్తో మాట్లాడారు. మన రాష్ట్రానికి చెందిన యాత్రికులు ఎవరైనా ఉన్నారా.. ఉంటే ఎంత మంది ఉన్నారనే పూర్తి సమాచారం తెలియజేయాలని కోరారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి వివరాలు అందజేయాలని ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్, కో ఆర్డినేషన్ సెక్రెటరీని ఆదేశించారు.
