ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి
1 min read
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ బడా గణేషుడిని దర్శించుకున్నారు. వినాయకుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవిత అంటే గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహాగణపతేనని రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని మతాల సమైక్యతను చాటాడానికే గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచానికే ఆదర్శంగా ఉత్సవాలను జరుపుకుంటున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. వినాయకుడి ఆశ్వీరాధంతో తెలంగాణ ప్రజలను సఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.