అమెరికాకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
1 min read
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. కుటుంబంతో సహా ఆయన దాదాపు పది రోజుల పాటు యూఎస్ లో ఉండనున్నారు. గురువారం అమెరికాకు బయలుదేరుతున్న రేవంత్ రెడ్డి వచ్చే నెల 7 న తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. జూన్ 2న డల్లాస్ లో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అమెరికాలోని వివిధ తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.