బీజేపీ కి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా…
1 min read
తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవి చిచ్చు పెట్టింది. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వడం లేదంటు ఆ పార్టీ కి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు. మీ పార్టీ కో దండం అంటూ ఆయన పార్టీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి గా సీనియర్ నేత రామచంద్రరావు కి అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఈ రోజు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో రాజా సింగ్ కూడా నామినేషన్ కోసం వచ్చారు. అయితే ఆయన నామినేషన్ పత్రం పైన ప్రతిపాదకులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే తనకు మద్దతు గా సంతకం చేయనివ్వకుండా నాయకులను బెదిరించారని రాజా సింగ్ ఆరోపించారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాకుండా కొంత మంది నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే రాజా సింగ్ గత కొంత కాలంగా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పైన గుర్రుగా ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా కిషన్ రెడ్డి పైన విమర్శలు గుప్పిస్తున్నారు. రాజాసింగ్ తీరు బీజేపీకి చికాకు గా మారింది. తాజాగా ఆయనే రాజీనామా చేసి పార్టీ నుంచి వెళ్లిపోయారు.