వారంలో రైతు భరోసా
1 min read
తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అరక దున్నారు. రైతు అవతారం ఎత్తిన ఆయన దుక్కి దున్ని విత్తనం వేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రైతు ను రాజు చేయాలనేదే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయిన ప్రభుత్వం రైతులను ప్రోత్సాహిస్తోందన్నారు. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులకు రూ.17000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో నే రూ 21000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్త శుద్ది తో పని చేస్తోందన్నారు.
నాణ్యమైన విత్తనాలు,ఎరువులు ఇబ్బంది లేకుండా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని పొంగులేటి వివరించారు.
గత ప్రభుత్వం వారి స్వార్థం కోసం ప్రాజెక్టులు మొదలు పెట్టి అర్ధాంతరంగా వదిలేస్తే వాటిని పూర్తి చేస్తూ సాగు నీటిని అందిస్తామన్నారు.వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి పెట్టుబడి కోసం 12 వేలు ఇస్తామని, రైతు భరోసా ఇప్పటికే రెండు సార్లు ఇచ్చామన్నారు.