కంచ గచ్చిబౌలి భూములపైన వాస్తవాలు ఇవే…
1 min read
2004 జనవరి 13 నాడు ఉమ్మడి రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమిని యూనివర్సిటీ నుంచి తీసుకొని ఐ .ఎం .జి. భారత స్పోర్ట్స్ అకాడమీ పేరిట బిల్లీ రావు, ప్యాటి రావు వంటి వారి పేరిట 400 ఎకరాలు కేటాయించారు.యూనివర్సిటీ భూమి కదా, అలా ఎలా ఇస్తారు అన్న ప్రశ్న రాగా ఆనాటి ప్రభుత్వం ఆ 400 ఎకరాలకు భూ బదలాయింపుగా 397 ఎకరాలు, అదే యూనివర్సిటీకి ఆనుకొని గోపనపల్లి అటు పక్కన రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకి భూమిని కేటాయించింది. అందుకు ఆనాటి యూనివర్సిటీ పాలకవర్గం, రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ అధికారులు అధికారికంగా ఆమోదించి సంతకాలు చేశారు. ఆనాడే యూనివర్సిటీకి ఒక ప్రాంతంలో బదులు మరో ప్రాంతంలో 400 ఎకరాల భూమి కేటాయించబడింది.
యూనివర్సిటీకి ఒక ప్రాంతంలో బదులు మరో ప్రాంతంలో భూమి దక్కింది. మరి కళంకితులైన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి విలువైన ప్రభుత్వ భూమి పోతే ఎట్లా అని నాడు అధికారంలోకి వచ్చిన సీఎం, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 21=11=2006 నాడు రద్దు చేశారు.
గత ప్రభుత్వం కేటాయించిన భూమి నాకే ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి వీలులేదని హైకోర్టును ఆశ్రయించారు.
ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఈ విషయాన్ని గాలికి వదిలేసింది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే ఏదో రకంగా ప్రయోజనం పొందవచ్చు అని గులాబీ నేతలు మౌనం వహించారు.
బిల్లీ రావు చేతిలోని వే లకోట్ల విలువైన భూమిలో ఇంచు కూడా వదలొద్దని రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాయకత్వంలోని ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాడి విజయం సాధించింది.
20 ఏళ్ల కింద కేటాయించిన భూమిని తిరిగి తెచ్చుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలోని పరిశ్రమల శాఖకు అప్పగించింది. మన రాష్ట్ర యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రైవేటు సంస్థల ద్వారా లక్షలాది ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ ప్రభుత్వ పెద్దలంతా స్పష్టంగా ప్రకటిస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో పునాది వేసిన హైటెక్ సిటీ.. కాల క్రమంలో వచ్చిన ఫైనాన్షియల్ సిటీ, నాలెడ్జ్ సిటీ మాదిరిగానే మరో software సిటీ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
మరి యూనివర్సిటీ భూములను ప్రభుత్వం అమ్మింది ఎక్కడ? పోరాడి తెచ్చిన భూమిని మంత్రుల వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారా? మనమంతా ఆలోచించాలి కదా.
మానవాళి కల్యాణం కోసం ఉపయోగించాల్సిన AI వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని కొందరు కుట్రపూరితంగా విష ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగులపై రాజకీయ కుట్ర జరుగుతున్న విషయాన్ని పసిగట్టకపోతే మనమంతా ప్రమాదంలో పడే అవకాశం ఉంది..
యూనివర్సిటీ భూముల్లో అరుదైన పక్షులు, జంతుజాలం ఉన్నాయి. వాటిని ప్రభుత్వం బుల్డోజర్ల ద్వారా కనుమరుగు చేస్తుందంటూ AI టెక్నాలజీ తో ఒక ఫోటోని సృష్టించి.. ముసుగు దొంగల రూపంలో సమాజంలో ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారు.