తెలంగాణ సెక్రటేరియట్ లోకి ప్రతిపక్ష పార్టీలకు ఎంట్రీ
1 min read
తెలంగాణ సెక్రటేరియట్ లో ప్రతిపక్ష పార్టీలకు ఎంట్రీ దొరికింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయం లోకి వివిధ వర్గాలకు చెందిన వారు రావడానికి అవకాశం లభిస్తోంది. తాజాగా సీపీఎం పార్టీకి చెందిన ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డి ని సెక్రటేరియట్ లో కలిశారు. సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో ముఖ్యమంత్రి తో నేతలు భేటీ అయ్యారు. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి ఆమె షటిల్ బ్యాట్ ను అందజేశారు.