జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. జూబ్లీహిల్స్ లోని జానారెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి వెళ్లారు. జానారెడ్డి ఇటీవల మోకాలి ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో జానారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
