తెలంగాణలో చెక్ పోస్టులు క్లోజ్

తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ చెక్పోస్టులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తక్షణమే చెక్పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్పోర్ట్ చెక్పోస్టులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ స్పష్టం చేశారు. చెక్క్పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే పునర్వినియోగం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బ్యారికేడ్లు, తొలగించాలని స్పష్టం చేశారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్ను డీటీవో కార్యాలయాలకు తరలించాలని ,అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలని సూచించారు.
