అక్బరుద్దీన్ ఓవైసీ వియ్యంకుడి ఆత్మహత్య

ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్భరుద్దీన్ ఓవైసీ వియ్యంకుడు డాక్టర్ మజార్ అహ్మద్ ఆత్మహత్య చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మజార్ తుఫాకీతో కాల్చుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే ప్రాణాలు వదిలాడు. మజార్ మరణ వార్త తెలియగానే అక్బరుద్దీన్ ఓవైసీ అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. మజారా్ ఆత్మహత్యకు కారణాలు తెలియరావాల్సి ఉంది.