పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్

ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లిన చంద్రశేఖర్ రావు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి 2.25 కోట్ల రూపాయలను ఆర్థిక సాయాన్ని కేసీఆర్ అందించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం రూ. 2 కోట్లు, ఆయన తల్లి బాగోగుల కోసం రూ. 25 లక్షల చెక్ను ఆయన అందించారు.

