హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

విదేశీ పర్యటనను ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజూమున అమెరికా నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న సీఎంకి కాంగ్రెస్ నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్లారు. హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్ షిప్ అంశంపైన ప్రత్యేక కోర్సు పూర్తి చేశారు. హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మరో పది రోజుల పాటు బిజి బిజిగా ఉండనున్నారు. మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పు పైన వరసగా జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.
