సోనియా,రాహుల్, ప్రియాంకతో రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆమె నివాసానికి వెళ్లిన సీఎం ఈ నెల 8,9 న జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించారు. పార్లమెంటు లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ప్రత్యేకంగా వారిని ఆహ్వానించారు.
భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఆదాయ వృద్ధి లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి వివరించి.. ఆహ్వాన పత్రికను అందించారు.
