పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలనం.. వైరా అభ్యర్థి ప్రకటన

1 min read

ఖమ్మం రాజకీయాల్లో సంచలనంగా మారిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో సంచలనానికి తెరతీశారు. బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయించుకున్న ఆయన గత కొన్నాళ్లుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అభిమానులు, అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపైన చర్చిస్తున్నారు. త్వరలోనే ఆయన ఏదో ఒక పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ లో చేరతారంటు లేదు కాంగ్రెస్ లోకి వెళ్తారంటు పెద్ద ఎత్తున ఉహాగానాలు వచ్చాయి. తాజాగా వైఎస్ షర్మిల పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 8న పాలేరులో జరిగే షర్మిల బహిరంగ సభలో పొంగులేటి వైఎస్ ఆర్ టీపీలో జాయిన్ కావొచ్చునని అంటున్నారు. ఒక వైపు ఈ చర్చ జరుగుతుండగానే ఆయన మరో సంచలన ప్రకటన చేశారు. వైరా నియోజకవర్గానికి తన  తరుపున అభ్యర్థిని ఖరారు చేశారు. ప్రముఖ సిపిఎం నేత కుమార్తె విజయాబాయి  వచ్చే ఎన్నికల్లో తన తరుపున పోటీ చేస్తారని స్పష్టం చేశారు. పార్టీ పేరు చెప్పకుండా తన వర్గం నుంచి బరిలో ఉంటారని పొంగులేటి పేర్కొన్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ , షర్మిల పార్టీల్లో చేరతారన్న ప్రచారానికి అడ్డుకట్ట పడినట్లైంది. వచ్చే ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn